రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి అనంతరం సినిమాలకు కొంత విరామం ప్రకటించి రాజకీయాల్లో బిజీ అయిన టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. 

 

ఇక దీనితో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మూవీలో కూడా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. మొఘలాయుల కాలం నాటి కథగా ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల జరిగింది. అయితే కరోనా ఎఫెక్ట్ వలన, దేశాన్ని లాకౌట్ ప్రకటించడంతో సినిమా షూటింగ్స్ అన్ని కూడా రద్దైన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నట్లు టాక్. 

 

ముందుగా ఆ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ నటుల పేర్లు పరిశీలించిన క్రిష్, ఆ పాత్రకు సరిగ్గా సంజయ్ దత్ అయితేనే బాగుంటారని భావించి ఆయనను సంప్రదించగా, ఆయన కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్ 2 లో ఆధీరా క్యారెక్టర్ లో నటిస్తున్న సంజయ్ దత్, తెలుగులో కూడా మంచి పాత్ర వస్తే నటించడానికి సిద్ధం అని గతంలో చెప్పడం జరిగింది. అయితే ఆయన అనుకున్న విధంగా ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉండనున్నట్లు టాక్. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఆ సినిమా టీమ్ నుండి అధికారిక ప్రకటన వెలువల్సి ఉంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: