సౌత్‌ సినిమా ఇండస్ట్రీ మొత్తం లో ఇప్పటి వరకు ఒక్క ప్రభాస్ కి మాత్రమే పాన్ ఇండియా స్టార్ అన్న రేంజ్ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. బాహుబలి ఫ్రాంఛైజీ తో ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ అన్న ఇమేజ్ వచ్చింది దర్శక ధీరుడు రాజమౌళి మూలానే. అందుకే ఆ తర్వాత అందరూ హీరోలు పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీని సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కథ భారీగా ఉండేలా అందుకు భారీ బడ్జెట్ ని కేటాయించడం నాలుగైదు భాషల్లో నిర్మించడం లాంటి సాహసాలు చేస్తున్నారు.

 

అయితే పాన్ ఇండియా స్టార్ అన్న ఇమేజ్ రావడం అంత సులభమైన విషయం కాదు. అంతేకాదు ఈ ఇమేజ్ ని నిలుపుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఈ విషయం ప్రభాస్ త్వరగానే అర్థం చేసుకున్నాడు. అది కూడా సాహో సినిమాతోనే. ఈ సినిమా ప్రభాస్ కి ఒక పెద్ద పాఠం గా మిగిలింది. అందుకే తన తర్వాత సినిమా విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మేకర్స్ కి అతిగా బడ్జెట్ ఖర్చు చేసి అబాసుపాలు కావద్దని సలహా ఇస్తున్నాడు. సినిమాకి ఎంత అవసరమో అంతే ఖర్చు చేయమని ఖచ్చితంగా చెబుతున్నాడట.

 

కానీ మన స్టార్ హీరోలు మాత్రం ప్రభాస్ ని ఫాలో అవుతూ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సాధించుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఈ రేస్ లో ప్రస్తుతం ఎన్.టి.ఆర్,
 రాం చరణ్ ముందు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పక్కాగా తారక్, చరణ్ లకి పాన్ ఇండియా స్టార్స్ అన్న క్రేజ్ రావడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు.

 

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా ని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. అందుకే అయిదు భాషల్లో రిలీజ్ చేస్తామని రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటి ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ ఇలా ప్రభాస్ ని ఫాలో అయి దెబ్బ తింటాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాని అల్లు అర్జున్ ఈ సినిమాతో గనక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగితే మాత్రం ఆ రేంజ్ వేరే... అంటూ బన్నీ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: