సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. అనీల్ రావిపూడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ తరువాత మహేష్ పరశురామ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గీతా గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పరశురామ్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

 

ఈ మూవీలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ అందించే అవకాశం ఉందాం అంటున్నారు. ఇక సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్రని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. కన్నడ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి హిట్ అందుకుని.. ఉపేంద్రకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ పాపులారిటీటోన్ త్రివిక్రమ్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో మంచి రోల్ ఇచ్చారు. 

 

సినిమా హిట్టయినా సరే తెలుగులో ఉపేంద్ర కొనసాగించలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ సినిమాలో విలన్ గా నటించే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. మహేష్ కు విలన్ గా ఉపేంద్ర నటించేది నిజమే అయితే సినిమాకు మరింత క్రేజ్ వచ్చినట్టే. పరశురామ్ ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయగా నేడో రేపో సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మహేష్ క్యారక్టరైజేషన కూడా కొత్తగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. సినిమాకు సంబందించిన మిగతా వివరాలు త్వరలో బయటకు వస్తాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: