బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ కరిమ్‌ మొరానీతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్ల షాజా మొరానీ, జోయ మొరానీకు ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో జోయా కరోనా నుంచి పూర్తిగాకొలుకొని హాస్పిటల్‌ నుంచి డిస్చార్జ్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా వెల్లడించింది. నానావతి హస్పిటల్‌ నుంచి డిస్చార్జ్‌ అయిన జోయ ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

 

`యోధులకు గుడ్‌ బై చెప్పే సమయం వచ్చింది. ఆరి కోసం నేను ఎప్పటికీ ప్రార్థిస్తూనే ఉంటాను. గుడ్‌ బై ఐసోలేషన్‌ ఐసీయూ. నా ప్రియమైన ఇంటికి వెళ్లే సమయమైంది. ` అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసింది జోయా. అంతకు ముందుకు వరుణ్‌ ధావన్‌తో లైవ్‌ చాటింగ్ సందర్భంగా తన ఆరోగ్యం బాగుపడిందన్న విషయాన్ని వెల్లడించింది.

 

జోయా సోదరి షాజా కూడా ఇప్పటికే కోలుకొని హాస్పిటల్‌ నుంచి డిస్చార్జ్‌ అయ్యింది. తండ్రి కరీం మాత్రం ఇంక ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. షాజా, కరీంలకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌ రాగా, జోయాకు మాత్రం కొద్ది పాటి లక్షణాలు కనిపించాయి. త్వరలోనే ఆమె తన కరోనా ఎక్స్‌పీరియన్స్‌ను అభిమానులతో షేర్ చేసుకోనుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Written by A Covid-19 Positive but also a Faith Positive Patient, my sister @shazamorani 🤍 Repost @shazamorani ・・・ So happy to be home. I wrote a letter to @theitihaascompany while I was hospitalised. It’s long so please bear with me 😋It felt so good. Can’t wait to read the book with everyone’s experiences. #WriteToRemember and email yours to theitihaascompany@gmail.com

A post shared by Zoa💫 (@zoamorani) on

మరింత సమాచారం తెలుసుకోండి: