మహేష్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య మరొకసారి వార్ జరగబోతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల మధ్య జరిగిన ఫైట్ మహేష్ బన్నీల మధ్య వ్యక్తిగత ఇగో వార్ గా మారింది. 


వాస్తవానికి ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదలై విజయం సాధించినా ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ పై స్పష్టమైన కలక్షన్స్ ఆధిక్యం ప్రదర్శించినా ఈ రెండు సినిమాల కలక్షన్స్ ఫిగర్స్ ఫేక్ అంటూ ఇప్పటికి ఒక ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో గతనెల ఉగాది రోజున బుల్లితెర పై ప్రసారం చేయబడ్డ ‘సరిలేరు నీకెవ్వరు’ రేటింగ్స్ విషయంలో ‘బాహుబలి 2’ టీఆర్పీ రేటింగ్స్ ను క్రాస్ చేయడంతో మహేష్ అభిమానులు మహేష్ బుల్లితెర పై కూడ తమ హీరో సూపర్ స్టార్ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు. 


ఇప్పుడు ఈ ప్రచారానికి బన్నీ అభిమానులు సరైన సమాధానం ఇచ్చే అవకాశం అనుకోకుండా వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలోనే ‘అల వైకుంఠపురములో’ మూవీని జెమినీ ఛానల్ ఈ లాక్ డౌన్ రోజులలోనే ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


లాక్ డౌన్ పుణ్యమా అనీ జనం అంతా టివీలకు అతుక్కుపోతున్న పరిస్థితులలో ఇప్పుడు అతి త్వరలో ప్రసారం కాబోయే బన్నీ మూవీ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ టిఆర్పీ రేటింగ్స్ ను బ్రేక్ చేయడం ఖాయం అంటూ ఇప్పటి నుంచే బన్నీ అభిమానులు మహేష్ అభిమానులను రెచ్చ గొడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా సినిమాలు లేకపోవడంతో టాప్ హీరోల అభిమానులు అంతా ఇళ్ళ ఏదో ఒక కారణాన్ని క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో సందడి చేస్తూ తమ హీరోల క్రేజ్ ను కాపాడుకోవడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు అన్వేషిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: