అక్కినేని సమంత.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో నటిగా మంచి గుర్తింపుతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. కెరీర్ ప్రారంభం నుండి నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన మొదటి హీరో నాగచైతన్య నే వివాహం చేసుకుని అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా అడుగు పెట్టింది.  ఏడాదిని గ్రాండ్ గా ముగించిన సమంత, 2020లో జానుతో పలకరించింది. ఈ చిత్ర ఫలితం ఎలా ఉన్న 'జాను'గా సమంత నటన ప్రశంసలు అందుకుంది. సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారు. గత ఏడాది వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫిక్షనల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ 'ఓ బేబీ' సూపర్ హిట్ అందుకుంది. సమంత ఆ చిత్రంతో యూఎస్ బాక్సాఫీస్ వద్ద సోలోగా వన్ మిలియన్ కలెక్షన్స్ అందుకొని రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రంలో రెండు భిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో సమంత ప్రేక్షకులకు మంచి వినోదం పంచింది.

 


ఇదిలా ఉండగా ఇప్పుడు సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడట. లేటెస్ట్ గా వచ్చిన ఫిల్మ్ నగర్ సమాచారం మేరకు ఈ మూవీలో హీరో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. ఈ సినిమా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా ఈ క్రేజీ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఓ బేబీ చిత్రంలో కూడా నాగ చైతన్య స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆయన కొంచెం నిడివి కలిగిన కీలక రోల్ చేస్తున్నారు అని వినిపిస్తుంది. చూడాలి మరి చైతూ సమంత సినిమాలో గెస్ట్ గా కనిపిస్తాడో లేదో చూడాలి. ఇప్పటి వరకు చైతు - సమంత కాంబోలో ఏమాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ చిత్రాల్లో నటించారు. మహానటి సినిమాలో ఇద్దరు నటించారు కానీ కలిసి సీన్స్ లో యాక్ట్ చేయలేదు. ఒక వేళ ఈ వార్త నిజమై మళ్ళీ నాగ చైతన్య సమంతలు స్క్రీన్ మీద కనిపిస్తే పండగే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: