ఒక్క ఛాన్స్ వస్తే బావుండు అనుకునే వారు సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది ఉంటారు. ఇక హీరోయిన్ల‌కు ముందుగా ఛాన్సులు రావ‌డం క‌ష్టం... ఒక్క‌సారి క్లిక్ అయితే ఇక వాళ్ల‌కు వచ్చే క్రేజ్ మామూలుగా ఉండ‌దు. హీరోల్లా వీళ్ల‌కు ఏళ్ల‌కు ఏళ్లు జ‌ర్నీ ఉండ‌దు. అందుకే అవ‌కాశాలు ఉండ‌గానే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌ని చూస్తుంటారు. అప్పుడే వీరు చెట్టు ఎక్కి కూర్చుంటారు. ఇప్పుడు పూజా హెగ్డే సైతం ఇదే బాట‌లో వెళుతోంది. టాలీవుడ్ లో సీనియ‌ర్ హీరోయిన్లు అయిన అనుష్క, సమంత, కాజల్, తమన్నా వంటి సీనియర్ హీరోయిన్స్ కి పూజ గట్టి పోటీని ఇస్తోంది. 

 

కుర్ర హీరోలు సీనియర్ హీరోలు అందరూ కూడా ఇప్పుడు పూజానే కావాల‌ని పట్టుబ‌డుతున్నారు. ఇక సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా సూప‌ర్ డూప‌ర్ ఇండ‌స్ట్రీ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు పూజ క్రేజ్ మామూలుగా లేదు. అంద‌రు క్రేజీ హీరోలు ఆమె వెంటే ప‌రుగులు తీస్తున్నారు. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్స్ రావ‌డంతో ఈ అమ్మ‌డు బాగా రేటు పెంచేసింద‌ట‌. అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో న‌టించాల‌న్నా కూడా తాను చెప్పిన రేటు ఓకే చేస్తేనే ఎస్ అంటోంద‌ట‌.. లేక‌పోతే నిర్దాక్షిణంగా నా ఖాల్షీట్లు ఖాళీ లేవ‌ని చెపుతోంద‌ట‌.

 

ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేసే అవకాశం దక్కించుకున్న అమ్మడు మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఏదేమైనా ఆమెను స్టార్ హీరోయిన్‌ను చేసిన టాలీవుడ్‌ను ఇప్పుడు ఆమె ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేద‌ని.. స్టార్ హీరోల సినిమాల‌న్నా లెక్కేలేద‌ని... అమ్మ‌డికి అవ‌స‌రం తీరాక బోడి మ‌ల్ల‌న్న సామెత గుర్తు చేస్తోంద‌ని అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: