టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీ స్టారర్ హవా ఎక్కువగా కొనసాగుతుంది. మల్టీ స్టారర్ సినిమాల మీద హీరోలు ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ సినిమాల మీద మార్కెట్ ఎక్కువగా జరుగుతున్న నేపధ్యంలో అగ్ర హీరోలు వీటిని నిర్మించడానికి నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అటు దర్శకులు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. అగ్ర హీరోలు అందరూ కూడా మల్టీ స్టారర్ సినిమాల మార్కెట్ ని తెలుసుకుని వాటిని నిర్మించే పనిలో పడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. 

 

దీనిలో మెగా హీరో రామ్ చరణ్ నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి కి సినిమాను విడుదల చెయ్యాలి అని భావించినా కొన్ని కారణాలతో అది వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అటు అక్కినేని ఫ్యామిలీ కూడా మల్టీ స్టారర్ సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక సినిమా చెయ్యాలి అని భావిస్తున్నట్టు సమాచారం. చిరంజీవిసినిమా మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చిరంజీవిసినిమా విషయంలో ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నారని ఇది సరైన సమయం అని భావించి ఆయన ఈ సినిమాను తెరకేక్కించాలి అని భావిస్తున్నారు. ఆ సినిమా ఎవరి తో చేస్తారు అనేది తెలియడం లేదు. ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ మొత్తం కనిపించే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి అనేది అర్ధమవుతుంది. రాజకీయ కోణం కూడా ఈ సినిమాలో చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: