టాలీవుడ్ లో ప్రభాస్ సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. టాలీవుడ్ లో అతని సినిమాలకు బాహుబలి సినిమా తర్వాత మంచి క్రేజ్ ఏర్పడింది. అతను సినిమా చేసినా చేయకపోయినా సరే ఏదోక ప్రచారం మాత్రం బిజీ గా చేస్తూ ఉంటారు జనాలు. ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందు ఈ ఏడాది ఈ సినిమాను విడుదల చెయ్యాలి అని భావించినా సరే కొన్ని కారణాలతో షూటింగ్ జరగడం లేదు. 

 

ఇక ఇప్పుడు ప్రభాస్ వచ్చే సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఖాళీ గా ఉండటం తో అతను కథలను ఎంపిక చేసుకుని సినిమాలను చెయ్యాలని భావిస్తున్నాడు. కథల ఎంపికల విషయంలో తన పెదనాన్న సలహాలను తీసుకోవాలని భావిస్తున్న ఈ హీరో ఇప్పుడు నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది. త్వరగా షూటింగ్ అయిపోయే సినిమా అయితే తాను చేసేది లేదని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు చేసే సినిమాలు అన్నీ కూడా భారీ బడ్జెట్ తో చేసే సినిమాలు చేస్తున్నాడు. దీనితో సినిమా ధర భారీగా పెరుగుతుంది. 

 

వడ్డీలు కూడా పెరుగుతున్నాయి. దీనిపై ఇప్పుడు నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలా వద్దని కొందరు సూచించినా సరే అతను మాత్రం మార్కెట్ ని ఎక్కువగా దృష్టి పెట్టుకుని ఈ సినిమాలు చేస్తున్నాడని రెండు సినిమాలను ఇలాగే చేసే యోచనలో ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో వస్తుందే. ఈ సినిమా రాధాక్రిష్ణ  దర్శకత్వంలో రావడం తో ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నేలకొంది. ప్రభాస్ సాహో సినిమా తర్వాత పారితోషికం కూడా భారీగా పెంచాడని వార్తలు వస్తున్నాయి. దీనితో నిర్మాతలు అతని సినిమాలు అంటే భయపడే పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: