మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ట్రిపుల్ ఆర్ ను రాజమౌళి పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఇప్పటికే ముగ్గురు స్టార్స్ ఉన్న ఈ సినిమాలో మరో స్టార్ జాయిన్ అవుతాడు. ఆల్ రెడీ ఇద్దరు తెలుగు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నాడు. బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్ తో పాటు.. ఓ తమిళ హీరోను తీసుకునే ప్రయత్నంలో జక్కన్న ఉన్నాడు. ఇంతకీ ట్రిపుల్ ఆర్ లో నటించే ఆ నాలుగో స్టార్ హీరో ఎవరో తెలుసా. 

 

బాహుబలి ఇండియాలోని అన్ని భాషల్లో హిట్ కావడంతో.. రాజమౌళి తన స్టైల్ మార్చుకున్నాడు. అన్ని లాంగ్వేజ్ నటీనటులు ట్రిపుల్ ఆర్ లో ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. బాహుబలిని మించిన బడ్జెట్ 350కోట్లతో రౌద్రం.. రణం.. రుధిరం తెరకెక్కడంతో.. బాలీవుడ్ మార్కెట్ పెంచుకోవడానికి ఓ ముఖ్య పాత్ర కోసం అజయ్ దేవగణ్ ను తీసుకున్నాడు రాజమౌళి. 

 

బాలీవుడ్ లో తొలి 300కోట్లు దాటిన సినిమాగా బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలితో వచ్చిన క్రేజ్ రాజమౌళి తర్వాతి మూవీ ట్రిపుల్ ఆర్ కు ఉపయోగపడనుంది. ఈ క్రమంలో భారీ బిజినెస్ కోసం.. రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియాభట్ ను ఎంచుకున్నాడు రాజమౌళి. 

 

బయటకు చెప్పకపోయినా.. ట్రిపుల్ ఆర్ లో గెస్ట్ రోల్ ఒకటుందట. ఇందులో తమిళ స్టార్ విజయ్ ను తీసుకునే ఉద్దేశంలో రాజమౌళి ఉన్నాడని తెలిసింది. చిత్ర వర్గాలు ఎనౌన్స్ చేయకపోయినా.. ఆయన పేరు దాదాపు ఖరారైందట. తమిళ ఇండస్ట్రీలో ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టే విజయ్ ఉంటే.. ట్రిపుల్ ఆర్ కు కోలీవుడ్ లో మరింత క్రేజ్ వస్తుందని అంచనా. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ విజయ్.. ఇలా ట్రిపుల్ ఆర్ స్టార్ హీరోలతో నిండిపోతోంది. మొత్తానికి రాజమౌళి.. తన సినిమాల్లో వైవిధ్యాన్ని కనుబరుస్తూ సినీ అభిమానుల్లో ఒకింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: