ఈరోజుల్లో నుండి ప్రతిరోజూ పండుగే వరకు మారుతి దర్శకత్వ ప్రతిభ అందరికి తెలిసిందే. ఈరోజుల్లో, బస్టాప్ సినిమాల తర్వాత అడల్ట్ సినిమాలు తీసే దర్శకుడు అంటూ అతని మీద చాలా వార్తలు వచ్చాయి. అయితే నానితో భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత మారుతికి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఫ్యాన్స్ గా మారారు. ఇక అప్పటినుండి అతని సినిమాలన్నీ క్లీన్ ఎంటర్టైనర్ గా వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వల్ల క్వారెంటైన్ టైం లో కూడా శర్వానంద్ తో తీసిన మహానుభావుడు సినిమా తీసిన మారుతి గురించి అందరు మాట్లాడుతున్నారు. శైలజా రెడ్డి అల్లుడు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా సాయి తేజ్ తో తీసిన ప్రతిరోజూ పండుగే సినిమాతో హిట్ అందుకున్నాడు మారుతి. 

 

ఇక తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్న మారుతి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను కలిసి ఒక కథ వినిపించాడట. తాను రాసుకున్న కథలో రామ్ అయితే బాగుంటాడని భావించి రామ్ కు కథ చెప్పాడట. అయితే మారుతి చెప్పిన కథ ఆ హీరోకి నచ్చలేదట. మారుతి కథల్లో లైన్ చాలా చిన్నగా ఉన్నా దాన్ని చాలా బాగా డెవలప్ చేస్తాడు. అయితే మారుతి మీద ఆ నమ్మకం ఉంచని రామ్ సినిమా చేయనని చెప్పాడట. ఇప్పుడు అదే కథతో వేరే హీరో దగ్గరకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడట మారుతి. 

 

ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ కూడా కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం రీమేక్ గా వస్తున్న రెడ్ సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా తర్వాత రెండు మూడు కథలు విన్న రామ్ వాటిని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. మరి రామ్ కాదన్న కథని మారుతి ఎవరితో తీస్తాడో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: