మొన్న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఉన్నప్పటికి కూడా కేవలం ఒక్కరోజు గ్యాప్ లోనే తన సినిమా రిలీజ్ చేసారు. అయినప్పటికీ కూడా రెండు సినిమాలు కూడా మంచి టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో ముందుకు సాగాయి. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా సరిలేరు తెరకెక్కగా, అలరించే ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా అల సినిమా తెరకెక్కింది. 

 

త్రివిక్రమ్ మార్క్ స్టైల్ పంచెస్ తో, అదిరిపోయే యాక్షన్ సీన్స్, అద్భుతమైన సాంగ్స్ తో అల సినిమా ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పొందగా, సూపర్ స్టార్ స్టైలిష్ పెర్ఫార్మన్స్ తో పాటు అదరగొట్టే యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో సరిలేరు ముందుకు దూసుకెళ్లడం జరిగింది. ఈ విధంగా మహేష్, బన్నీల ఈ పోరులో ఇద్దరూ విజేతలుగా నిలవగా, రాబోయే మరికొద్దిరోజుల్లో బన్నీ ఈసారి రెబల్ స్టార్ ప్రభాస్ తో బాక్సాఫీస్ వద్ద తలపడనున్నట్లు టాలీవుడ్ వర్గాల లేటెస్ట్ టాక్. ప్రస్తుతం సుకుమార్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్న బన్నీ, ఆ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా జాన్ కూడా దాదాపుగా అదే సమయంలో వచ్చే ఛాన్స్ కనపడుతోందని అంటున్నారు. 

 

నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాది వస్తుందని మరొక వార్త ప్రచారం జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం కొనసాగుతున్న లాకౌట్ అనంతరం సినిమాని మరింత ఫాస్ట్ ముందుకు తీసుకెళ్లేలా సినిమా యూనిట్ పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసిందని, వాస్తవానికి ఇటీవల జార్జియాలో జరిగిన షెడ్యూల్ కరోనా ఎఫెక్ట్ వలన సడన్ గా ఆగిపోయిందని, లేకపోతే ఆ షెడ్యూల్ లో చాలావరకు షూటింగ్ జరిగిపోయి ఉందేధని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ అదేకనుక నిజం అయితే మాత్రం బన్నీ, ప్రభాస్ ఇద్దరూ కూడా బాక్సాఫీస్ బరిలో నిలిచి యుద్దానికి సిద్ధం అవడం ఖాయం అనే చెప్పాలి.....!!  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: