టాలీవుడ్ సినిమాలు ఎక్కువగా విదేశాల్లో షూట్ చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో అందమైన ప్రదేశాలు ఉన్నా సరే ఎక్కువగా విదేశాలలో షూటింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీనికి కారణం సినిమాలకు కమర్షియల్ మార్కెట్ ఎక్కువగా ఉండటమే. అందుకే ఇప్పుడు విదేశాల్లో షూట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. గతంలో ఇంత ఉండేది కాదు గాని ఇప్పుడు మాత్రం ఇది బాగా ఎక్కువైంది అనే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలకు ఎక్కువగా విదేశాల మీద కన్ను ఉంది. ప్రభాస్, మహేష్ బాబు ఇదే ప్రయత్నంలో ఉన్నారు. 

 

అయితే ఇప్పుడు కరోనా దెబ్బకు మూడేళ్ళ పాటు షూటింగ్ లను విదేశాల్లో రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. కథ విదేశాల్లో షూట్ చేసే ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వద్దని తెలుస్తుంది. కథలో పట్టు ఉన్నా లేకపోయినా విదేశాల్లో షూట్ చేస్తే అది హిట్ అయ్యేది. కాని ఇప్పుడు కరోనా ప్రభావం తో విదేశాల్లో అసలు షూటింగ్ లు వద్దని అక్కడ ఏదైనా తేడా జరిగితే చేసేది ఏమీ ఉండదు అనే భావనకు హీరోలు దర్శకులు వచ్చారు. నిర్మాతలకు కూడా ఖర్చు ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు వాళ్ళు విదేశాల్లో అసలు షూటింగ్ వద్దని అంటున్నారు. 

 

హీరో అయినా సరే ఇక్కడే సినిమా చెయ్యాలని లేని పోనీ ఇబ్బందులు తెచ్చుకుని కంటి మీద కునుకు లేకుండా బ్రతకడం కంటే ఇక్కడే సినిమా షూట్ చేసి దానికి ఎక్కువ ప్రచారం చేసుకుంటే మంచిది అనే భావనలో ఉన్నారు. అందుకే ఇప్పుడు అగ్ర హీరోలు కూడా తమ కోరికలను రుద్దడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం హీరోలకు మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి ఉన్నా సరే... వాళ్ళు స్వదేశంలోనే షూటింగ్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: