టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. చిరంజీవిసినిమా చేసినా సరే ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే చిరంజీవి సినిమాల మీద పెట్టుబడి పెట్టడానికి గానూ దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చిరంజీవి సినిమాలకు ఈ మధ్య కాలంలో మార్కెట్ ఎక్కువగానే పెరిగింది అనేది వాస్తవం. అందుకే ఆయన సినిమాలను ఎక్కువగా కుమారుడు రామ్ చరణ్ చేస్తున్నాడు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాను చేస్తున్నాడు. 

 

సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి సినిమా ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. ముందు ఆయన లూసిఫర్ అనే సినిమాను చేసే అవకాశం ఉందని భావించారు. కాని ఆ ప్రాజెక్ట్ ముందుకి వెళ్ళే పరిస్థితి దాదాపుగా కనపడటం లేదు. అందుకే చిరంజీవిసినిమా చేస్తారు అర్ధం కావడం లేదు. ఆయన మళ్ళీ కొరటాల శివ తోనే సినిమా చేసే అవకాశం ఉందీ అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఇప్పుడు కొరటాల కు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఆయనతోనే సినిమాను మళ్ళీ చిరు చెయ్యాలి అనుకుంటున్నారు అంటున్నారు. 

 

చిరంజీవి సినిమా విషయంలో ఆయన ఇప్పుడు చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఈ సినిమా కథ సమయంలోనే ఆయన ఎక్కువగా మరో కథ వినిపించే ప్రయత్నం చేసారని అది చిరంజీవికి బాగా నచ్చింది అని అందుకే మళ్ళీ తర్వాతి ప్రాజెక్ట్ కూడా ఆయనతోనే చేయడానికి చిరంజీవి ఆసక్తి చూపించారు అంటున్నారు. వచ్చే ఏడాది ఆచార్య విడుదల అయిన తర్వాత ఆ సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: