టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలకు మార్కెట్ పెరిగింది అనే విషయం అర్ధమవుతుంది. చిన్న చిన్న సినిమాలు కూడా మంచి గా ఆడుతున్నాయి. దీనితో ఇప్పుడు పాన్ ఇండియా మీద ఎక్కువగా దృష్టి పెట్టారు మన హీరోలు. పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు ఆడాలి అంటే అక్కడ కూడా తమా క్రేజ్ ని పెంచుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కాస్త కొత్తగా ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ సినిమాలకు మార్కెట్ పెరిగింది 

 

అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నాడు. పాన్ ఇండియా సినిమాలు అన్నీ కూడా బాగానే వసూలు చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ అక్కడ ఎక్కువగా దృష్టి పెట్టి సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నాడు. ఒక హింది పాట పాడటమే కాకుండా స్టార్ హీరో సినిమాను నిర్మించే యోచనలో తారక్ ఉన్నాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అక్కడ సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమా చేస్తాడని అంటున్నారు. సల్మాన్ కూడా అందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. 

 

టాలీవుడ్ లో సల్మాన్ ఒక సినిమా చేస్తాడని ఆ ఒప్పందం తోనే ఎన్టీఆర్ సల్మాన్ సినిమాలో పెట్టుబడి పెడుతున్నాడు అనేది కొందరి మాట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ తో ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ఇక్కడ మంచి ఆదరణ ఉంటుంది అనేది వాస్తవం. ఇక బాలీవుడ్ లో సల్మాన్ క్రేజ్ తెలిసిందే. అక్కడ అతని తో సినిమా చేసినా మంచి క్రేజ్ వస్తుంది. అక్కడి ప్రేక్షకులు అందరూ కూడా చూసే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: