సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్ద ఎత్తున వసూళ్ళు కలెక్ట్ చేసింది. మహర్షి సినిమా తర్వాత చేసిన సరిలేరు  నీకెవ్వరు సినిమా కూడా హిట్ అవడంతో మహేష్ అభిమానులు హ్యాప్పీగా ఉన్నారు. సరిలేరు తర్వాత మహేష్ మళ్ళీ మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేస్తానని చెప్పాడు.

 

కానీ వంశీ చెప్పిన నెరేషన్ నచ్చని మహేష్సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇప్పుడు మహేష్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడనేది సస్పెన్స్ గా మారింది. గీత గోవిందం సినిమాతో తన గీత మార్చుకున్న దర్శకుడు మహేష్ తో చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఈ పాటికే స్టార్ట్ కావల్సిందట. కానీ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదని సమాచారం.

 

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ మరో కొత్త రికార్డును అందుకోనున్నాడు. సోషల్ మీడియా వచ్చాక ప్రతీదీ రికార్డులాగే మారిపోయింది. ఎక్కువ లైక్స్ వచ్చిన పాటగా, ఎక్కువ కామెంట్లు వచ్చిన సినిమాగా, ఇలా ప్రతీదీ ఒక రికార్డు కిందే లెక్క కట్టి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాని 99 మిలియన్ల మంది చూశారు.

 


ఒక తెలుగు సినిమాకి యూట్యూబ్ లొ అన్ని వ్యూస్ రావడం ఇదే మొదటిసారి. మరికొన్ని రోజుల్లో ఈ లెక్క వంద మిలియన్లకి చేరుకుంటుంది. యూట్యూబ్ లో మొదటిసారి వంద మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న సినిమాగా శ్రీమంతుడు రికార్డుకెక్కనుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ అవడమే కాదు డిజిటల్ లోనూ తన సత్తా చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: