రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్, సాహో సినిమాతో ఉత్తరాదిన తన సత్తా ఏంటో చూపించాడు. సాహో సినిమా దక్షిణాదిన అంతగా ఆడకపోయినప్పటికీ బాలీవుడ్ లో దుమ్ము దులిపింది. దీంతో ప్రభాస్ ని అక్కడ ఎంతగా అభిమానిస్తారో అర్థమైపోయింది. సాహో మూవీ క్లాస్ ఫీల్ తో కూడుకున్నటు వంటి యాక్షన్ ఫిల్మ్.

 

బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులంతా కోరుకున్నది ఒక్కటే. ప్రభాస్ ని పక్కా మాస్ సినిమాలో చూడాలని. నేషనల్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇదే కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా పీరియాడిక్ డ్రామా. అది కూడా ప్రేమకథగా తెరకెక్కుతోంది. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ రూపుదిద్దికుంటోంది. కాబట్టి వీటి తర్వాత పక్కా మాస్ సినిమా చేయాలని కోరుతున్నారు.

 

ఛత్రపతి, మిర్చి వంటి మాస్ చిత్రాలలో తమ హీరోని చూడాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే మాస్ సినిమాని లైన్లో పెట్టాలని కోరుతున్నారు. ప్రభాస్ కి దేశవ్యాప్తంగా మాస్ జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే మంచి మాస్ సినిమా చేయాలని రిక్వెస్టులు పెరుగుతున్నాయి. అయితే మాస్ సినిమాకి ఒక్కో దగ్గర ఒక్కో డెఫినిషన్ ఉంటుంది. 

 

దక్షిణాదిన తెరకెక్కే మాస్ సినిమాలని, ఉత్తరాదిన తెరకెక్కే మాస్ సినిమాలకి చాలా తేడా ఉంటుంది. అయితే దక్షిణాది మాస్ చిత్రాలకి ఉత్తరాదిలో ఆదరణ బాగా పెరుగుతుంది. తెలుగు, తమిళ చిత్రాలకి యూట్యూబ్ లో వచ్చే రెస్పాన్స్ చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. అందుకే ప్రభాస్ మంచి మాస్ సినిమాని లైన్లో పెడితే   మరో లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. మరి ప్రభాస్ అభిమానుల కోరికని నెరవేరుస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: