భార‌త్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్‌ విధించి నేటికి 21 రోజులు అవుతున్నా పాజిటివ్‌ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజూ వేల సంఖ్యల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌ కేసుల సంఖ్య మంగ‌ళ‌వారం ఉద‌యం నాటికి  దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 10,363కు చేరుకుంది. ఇప్పటివరకు 339 మంది మృత్యువాతపడ్డారు. దేశ వ్యాప్తంగా 1035 కరోనా బాధితులు కొలుకున్నారని అధికార గణాంకాల ద్వారా తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లోనే దాదాపు 31 మంది క‌రోనా బారిన‌ప‌డి కన్నూమూశారు. 


  కొత్తగా నమోదైన కేసుల్లో దాదాపు 700కేసులు దిల్లీ, మహారాష్ట్రలోనే నిర్ధారణ అయ్యాయి. మొత్తం క‌రోనా బాధితుల్లో 1036మంది కోలుకోగా ప్రస్తుతం మరో 8988మంది చికిత్స పొందుతున్నారు. ఇక మ‌హారాష్ట్ర‌లో కరోనా విల‌యం సృష్టించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే  చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 160కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 349పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 
దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2334కి చేరింద‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య వైద్య‌శాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 


ఇదిలా ఉండ‌గా నిజాముద్దీన్‌ ఘటన త‌ర్వాత దేశ రాజధాని దిల్లీలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కేవలం ఒక్కరోజే 356 పాజిటివ్‌ కేసులు న‌మోదుకావ‌డం గ‌మానార్హం. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు దిల్లీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1510కి చేరింది. వీరిలో 28మంది మృత్యువాతపడ్డారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికా రులు అంచనా వేస్తున్నారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి ప్రజలను ఇళ్లనుంచి బయటకురాకుండా చర్యలు చేప‌ట్టారు. ఇక తమిళనాడులోనూ కొవిడ్‌-19 కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1173కి చేరగా 11మంది మృత్యువాతపడ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: