సూపర్​స్టార్​ మహేశ్​బాబు తెలుగు చిత్రసీమలో అగ్రపథంలో దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీతో ఈ సంక్రాంతికి బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ కా బాప్ అనిపించుకున్నాడు. మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేస్తున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అది పుకారుగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న సినిమాకి గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా రేపో మాపో అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందంట. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. 

 

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని మే 31న అఫిసియల్ గా స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. ప్రతి ఏడాది మహేష్ చిత్రానికి సంబంధించిన ఏదొక అప్డేట్ ఇవ్వడం మహేష్ బాబుకి సెంటిమెంటుగా వస్తోంది. ఈ విధంగా తన కెరీర్లో 27వ చిత్రాన్ని అదే రోజు స్టార్ట్ చేయబోతున్నాడట. కరోనా వైరస్ ప్రభావ పరిస్థితులను బట్టి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. మహేష్ కెరీర్లో చాలా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసిన సినిమాలుగా బిజినెస్ మ్యాన్, ఆగడు, సరిలేరు నీకెవ్వరూ అని చెప్పవచ్చు. రీసెంటుగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా రెగ్యులర్ షూటింగ్ గత ఏడాది జూలై నెలలో ప్రారంభించి సంక్రాంతి రేసులో నిలిపాడంటేనే అర్థం చేసుకోవచ్చు మహేష్ ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసాడని. అయితే ఇప్పుడు అదే స్పీడ్ తన నెక్స్ట్ సినిమాలో మెయింటైన్ చేస్తాడని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో మహేష్ బాబు మళ్ళీ సరిలేరు నీకెవ్వరూ సినిమాలాగే జెట్ స్పీడ్ తో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే సూపర్ స్టార్ కెరీర్లో వచ్చే 27వ సినిమా 2021 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇదే కనుక జరిగితే సూపర్ స్టార్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. వీరు గతంలో మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' అనే బ్లాక్ బస్టర్ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: