టాలీవుడ్ మెగా హీరో పవన్ కళ్యాన్ గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో తలమునకలై ఉన్న విషయం తెలిసిందే.  త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మూవీ తర్వాత పవన్ కళ్యాన్ పూర్తిగా రాజకీయాల వైపు వెళ్లారు.  గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపు నుంచి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే ఆయన సినిమాలపై ఫోకస్ పెట్టారు. వరుసగా మూడు సినిమాలు లైన్లో పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్ ’రిమేక్ గా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్నాడు.  

 

మూవీ షూటింగ్ సమయంలోనే కరోనా వైరస్ ప్రభావం ప్రబలింది. దాంతో సినీ పరిశ్రమలు షట్ టౌన్ అయ్యాయి.  అంతా పూర్తయితే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవికి ‘విరూపాక్ష’ టైటిల్ ఆలోచిస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుంది. వాళ్ల అధీనంలో వున్న 'కోహినూర్' వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాను షూటింగును 'మొరాకో'లో ఆరంభించాలని క్రిష్ బృందం అనుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తన ప్రభావం చూపుతోంది.

 

ఎక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోవలసి వస్తుందో అనే ఆందోళన అందరిలోను వుంది. విదేశాల్లో కన్నా ఇక్కడే బెటర్ అని క్రిష్ ఆలోచించారట.  హైదరాబాద్ లోనే భారీ సెట్స్ వేసి చిత్రీకరణ జరపాలని భావిస్తున్నారు. పవన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్లు గా అనుష్క,  జాక్విలిన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ తో మరో మూవీలో నటించబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: