సందీప్ కిషన్ హీరోగా ఢీ 16 ఫేమ్ నరేన్ కార్తీక్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా నరకాసురన్. సినిమాలో శ్రీయ శరణ్, అరవింద స్వామి కూడా నటించారు. తెలుగులో నరకాసురుడుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కొన్నాళ్లుగా రిలీజ్ కు నోచుకోని ఈ సినిమా ఫైనల్ గా మార్చి 27న రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల లాక్ డౌన్ ఉండటంతో సినిమా రిలీజ్ కాలేదు. 

 

ప్రస్తుతం థియేటర్లు బంద్ చేయడం.. లాక్ డౌన్ ఎత్తేసినా థియేటర్లకు ఇప్పుడప్పుడే పర్మిషన్ వచ్చేలా లేదని నరకాసురుడు సినిమాని ఆన్ లైన్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే అమెజాన్ తో డీల్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. ఏప్రిల్ 17న సందీప్ కిషన్ నరకాసురుడు సినిమా ఆమెజాన్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే తెలుగులో తమిళ డబ్బింగ్ సినిమా శక్తి డైరెక్ట్ గా అమెజాన్ లో రిలీజ్ అయ్యింది. 

 

సందీప్ కిషన్ సినిమా కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన తెనాలి రామకృష్ణ బిఎ,బిఎల్ ప్రేక్షకులను నిరాశపరచగా నరకాసురుడు మీద అంచనాలు పెట్టుకున్నాడు. అయితే డిజిటల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించింది. డెన్నిస్ జీవం డైరెక్ట్ చేస్తున్న ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు సందీప్ కిషన్. యువ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న సందీప్ కిషన్ రాబోయే సినిమాలతో అయినా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: