టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలోనే అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకున్నాడు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో లేడి అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇచ్చి సినిమాకు మ‌రింత ప్ల‌స్ అయ్యారు.  గత కొద్దిరోజులుగా సందేశాత్మక సినిమాలు చేస్తూ వస్తున్న మహేష్ ఈ సారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి త‌న న‌ట‌న‌తో విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు. 

 

ఇక విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్ దాడి ప్రారంభించిన మహేష్ బాబు ఈ సినిమా ద్వారా త‌న కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో సరిలేని జోరుతో ఈ బొమ్మ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనిపించుకుంది. అలాగే డ్యాన్స్ లు కానీ, ఫైట్లు కానీ కామెడీ కానీ మహేష్ ఈ చిత్రంలో చాలా ఉత్సాహంగా కనిపించాడు. దీంతో ప్రేక్ష‌కులు సైతం బాగా క‌నెక్ట్ అయ్యారు. అయితే దిల్‌ రాజు సమర్పణలో అనిల్‌ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆల్ టైం రికార్డు టీఆర్పీ రేటింగ్ ను ద‌క్కించుకుంది. దీంతో మ‌హేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

 

అయితే ఇప్పుడు మ‌హేస్ బాబు ఫ్యాన్స్‌తో పాటు అటు ప్రేక్ష‌కుల‌కు కూడా ఓ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు ఒరిజినల్ ప్రింట్ తో మరోసారి టెలికాస్ట్ కాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలోని ముందు తీసివేసిన సన్నివేశాలను కూడా కలిపి రెండోసారి టెలికాస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అదేగ‌నుక జ‌రిగితే.. మ‌రో సారి మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ కా బాప్ అనిపించుకునే విధంగా టీ ఆర్పీ రేటింగ్స్ ద‌బిడిదిబిడే చేస్తుంద‌ని అంటున్నారు.

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: