విజయ్ దేవరకొండ, రష్మిక మందనా వీరి కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రష్మిక మందనా పక్కన విజయ్ దేవరకొండ బాగా మ్యాచ్ అయ్యాడని ఆ సినిమాకు వాళ్ళు ఇద్దరే హైలెట్ గా నిలిచారని చాలా కామెంట్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. ఆ సినిమా మంచి వసూళ్లు సాధించడానికి ఈ జోడి నే ప్రధాన కారణం అని అన్నారు కూడా. ఇప్పుడు మళ్ళీ ఈ జోడీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది కొందరి మాట. విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమా తర్వాత చేసే సినిమాలో రష్మిక హీరోయిన్ అని అంటున్నారు. 

 

ఆమె కూడా అందుకు ఓకే చెప్పిందని తెలుస్తుంది. రష్మిక విషయంలో విజయ్ ముందు నుంచి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడని ఇక తన కెరీర్ కి బాగా హెల్ప్ అయిన సినిమా గీత గోవిందం అని భావిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు సినిమాలో నటించడానికి ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ సినిమా ఒక రకంగా హాట్ టాపిక్ అని అంటున్నారు. ఇది పక్కన పెడితే రష్మిక ప్రస్తుతం రెండు సినిమాల్లో చేస్తుంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. 

 

సినిమా రాజకీయ నేపధ్యంలో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మొదలు పెట్టే సూచనలు కనపడుతున్నాయి. ఇదిలా ఉంటే రష్మిక మందన్ ఈ ఏడాది రెండు హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సరసన ఒక సినిమాలో ఆమె నటించగా నితిన్ సరసన ఒక సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇక్కడి నుంచి భారీగా రేట్ పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: