రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలను చెయ్యాలి అని చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా కీలక సినిమాలే. అంటే భారీ ప్రాజెక్ట్ లే. వకీల్ సాబ్  సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకం. ఇప్పటికే షూటింగ్ ని కూడా ఈ సినిమా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి గానూ కరోన వైరస్ అడ్డ౦ రావడం తో దాన్ని వాయిదా వేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను ఎలా అయినా సరే ఈ ఏడాది చివర్లో విడుదల చెయ్యాలి అని భావిస్తున్నారు. 

 

ఈసినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను ఇప్పటికే మొదలు కూడా పెట్టింది చిత్ర యూనిట్. అయితే కరోనా కారణంగా దాన్ని కూడా వాయిదా వేసారు. ఆ సినిమాలో ఇప్పుడు ఒక కీలక వ్యక్తి నటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయనే చిరంజీవి. ఈ సినిమాలో చిరంజీవి ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఆయన ఏ పాత్ర చేస్తున్నారు అనేది స్పష్టత లేకపోయినా ఆ పాత్రలో చిరంజీవి నటించాలి అని పవన్ స్వయంగా కోరిన నేపధ్యంలోనే ఆయన ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 

 

ఆ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా కీలకమని అంటున్నారు. మార్కెట్ పెంచుకోవడానికే ఈ సినిమాను ఓకే చేసినట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత చిరంజీవి రామ్ చరణ్  తో చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే చిరూ ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో చేస్తున్నారు. ఆచార్య సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినా సరే కొన్ని కీలక భాగాల కారణంగా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: