అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ చాలా వరకు రేంజ్ పెంచాడు అనే చెప్పాలి. బన్నీ సినిమా అనగానే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా తర్వాత ఆసక్తి పెరిగింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు బన్నీ ని పెద్దగా పట్టించుకోని జనం కూడా ఆయన సినిమా మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు కాకపోయినా సరే  ఫస్ట్ లుక్ ని మాత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. పుష్ప అనే టైటిల్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది. 

 

ఆ టైటిల్ కూడా కాస్త భిన్నంగా ఉండటమే కాకుండా ఆ లుక్ లో బన్నీ కనపడిన తీరు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది అనే చెప్పవచ్చు. ఈ సినిమాలో బన్నీ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా మీద బన్నీ ఫాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే హీరోయిన్ గా రష్మిక మందన ను తీసుకోవాలని సుకుమార్ భావించారు. కాని ఎందుకో ఆగినట్టు సమాచారం. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 

 

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఆమెను సంప్రదించ గా ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. పారితోషికం కూడా ఎక్కువగా డిమాండ్ చేయలేదు అని సమాచారం. ఆమె ఓకే అనడం తో ఆమెను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఆమెకు బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దీనితోనే ఆమెను ఓకే చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎర్ర చందనం దొంగ గా ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: