గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఎంతో గొప్ప విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి సింహా సినిమాకు ముందు బాలయ్య, కెరీర్ పరంగా కొంత ఇబ్బందుల్లో పడ్డారు అనే చెప్పాలి. అయితే 2010లో సింహా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో బాలయ్యకు మళ్ళి పూర్వ వైభవం రావడం జరిగింది. ఇక ఆ తరువాత 2014లో వచ్చిన లెజెండ్ సినిమా కూడా బాలయ్యకు మంచి హిట్ అందించింది. 

 

కాగా ఈ రెండు సినిమాలతో బాలయ్యకు సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన బోయపాటి, ప్రస్తుతం ఆయనతో ముచ్చటగా మూడవ సినిమా చేస్తున్నారు. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తీసిన జయ జానకి నాయక సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీగా నిర్మితం అవుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల కొంత వరకు జరిగింది. కాగా అనుకోకుండా కరోనా మహమ్మారి వలన దేశాన్ని లాకౌట్ ప్రకటించడం, ఆపై షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో ఈ సినిమాని కూడా నిలుపుదల చేసారు. 

 

ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో బోయపాటి మాట్లాడుతూ, ఈ సినిమాలో బాలయ్య ప్రక్కన హీరోయిన్ గా ఒక కొత్త అమ్మాయిని తీసుకుంటున్నట్లు చెప్పారట. మంచి యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరా పండగ కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నాం అని, అలానే ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారని బోయపాటి చెప్పినట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బోయపాటి, బాలయ్యకు ఎంతమేర హిట్ ని అందిస్తారో చూడాలి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: