సూపర్ హిట్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కలయికలో మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈసినిమా లో హీరోయిన్ విషయంలో పలు పేర్లు తెర మీదకు వచ్చాయి. అందులో ఎక్కువగా అంజలి పేరు వినబడింది.
కానీ ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నామని బోయపాటి శ్రీను తాజాగా జరిగిన ఓఇంటర్వ్యూ లో వెల్లడించాడు అలాగే ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో జయ జానకి నాయక ఫేమ్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇదిలావుంటే గత ఏడాది ఏకంగా మూడు సినిమాలతో భారీ డిజాస్టర్ లను చవిచూశాడు బాలకృష్ణ. అందులో భాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు , రూలర్ దారుణమైన పరాజయాలు పొందాయి. దాంతో ఇప్పుడు బాలయ్య ,బోయపాటి పైనే ఆశలు పెట్టుకున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ ,లెజెండ్ సూపర్ హిట్లు కావడంతో ఈ మూడో సినిమా పై కూడా మంచి అంచనాలు వున్నాయి. ఇక బోయపాటి శ్రీను కూడా ఈ చిత్రం కీలకం కానుంది. గత ఏడాది వినయ విధేయరామ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు బోయపాటి. దాంతోఎలాగైనా ఈసారి సూపర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలతో వున్నాడు.