సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కైనా తనకంటూ గుర్తింపు మరియు సక్సెస్ తెచ్చిన చిసిమా అంటూ ఒకటుంటుంది. తన కెరీర్లో ఓ రేంజికి తీసుకెళ్లిన సినిమా అంటూ ఒకటుంటుంది . మంచు విష్ణు కెరీర్ లో అలాంటి సినిమానే 'ఢీ', 'ఢీ' సినిమా విడుదలై ఇప్పటికి 13 సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమా  మంచు విష్ణు ,జెనీలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచి సక్సెస్ సాధించింది, ఈ సందర్భంగా విష్ణు ,జెనీలియా మరియు శ్రీనువైట్ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది

విష్ణు ట్వీట్ చేస్తూ ..'ఢీ'సినిమా విడుదలై 13 సంవత్సరాలు అవుతుంది ,కరెక్టుగా 2007 ఏప్రిల్ 13 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది . ఈ సినిమా సక్సెస్ అయినప్పుడు సినిమా యూనిట్ మెంబెర్స్ మొహాలలో హ్యాపీనెస్ చూశాను. మా నాన్న మంచు మోహన్ బాబు చొరవ లేకుండా ఉండుంటే ఈ సినిమా విడుదలై ఉండేది కాదు . నాకు మంచి సక్సెస్ ఇచ్చిన నా పెద్దన్నయ్యకు కృతజ్ఞతలు . మరి 'ఢీ2' ఎప్పుడు అని విష్ణు శ్రీను వైట్లని అడిగినప్పుడు

 

జెనీలియా ...నేనుకూడా అక్కడ ఉన్నాను అది నువ్ చూడలేదా అని ట్వీట్ చేసింది ,అందుకు మంచు విష్ణు 'ఈ ఫొటో చూశావా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నిన్ను మరచిపోలేను' అని ట్వీట్ చేశాడు.అందుకు శ్రీనువైట్లకూడా ట్వీట్ చేశాడు ...అందరి సంహారం తో ఈ సినిమాలో కష్టతరమైన సన్నివేశాలను కూడా చాల సింపుల్ గా షూట్ చేశా.ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరూ ఓ మధుర జ్ఞాపకమే. ఈ చిత్ర నిర్మాత - నా స్నేహితుడు ఎమ్ ఎస్ ఎన్ రెడ్డికి కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: