ప్ర‌పంచమంతా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వ‌ణికిపోతోంది. ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికా దేశాల్లో జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఆ విష‌యం త‌లుచుకుంటుంటే చాలా విచార‌క‌ర‌మైన విష‌యం అని చెప్ప‌వ‌చ్చు. మ‌న దేశంలోనూ దీని ప్ర‌భావం మొద‌లైంది. అందులోనూ సినిమా రంగం పై ఎక్కువ‌గా ఉండేది. దీన్ని గ‌మ‌నించిన కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని విధించాయి. ఈ నెల 14న ముగుస్తుంద‌నుకున్న లాక్ డౌన్ క‌రోనా పాజిటివ్ కేసుల పెరుగుతుండ‌టంతో మే 3కు పొడిగించారు. దీంతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ అంతా మ‌రింత టెన్ష‌న్‌లో ప‌డిపోయింద‌ని చెప్పాలి.

 

దీంతో చాలా సినిమాల షెడ్యూల్స్‌, రిలీజ్ డేట్‌లు అన్నీ మారిపోయాయి. అయితే బోయ‌పాటి మాత్రం నో కాంప్ర‌మైజ్ అంటున్నాడు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రూపొందిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం వీరిద్ద‌రి సినిమా ప్రారంభోత్స‌వం అయింది. ఇటీవ‌లే కీల‌క షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఇందులో బాల‌య్య అఘోరాగా క‌నిపించ‌బోతున్నారు. ఈ వార్తే బాల‌య్య అభిమానుల‌ను షాక్ కు గురిచేస్తోంది. బాల‌య్య ఏంటీ అఘోరా ఏంట‌ని షాక‌వుతున్నారు.

 

ఇదిలా వుంటే మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్‌లో ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ఇంత‌కు ముందే ఫిక్స‌య్యారు. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ డేట్ మారే అవకాశం వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంటే ఆ డేట్ విష‌యంలో నో కాంప్ర‌మైజ్ అని బోయ‌పాటి చెబుతున్నాడ‌ట‌. ఏంటీ కాన్ఫిడెన్స్‌. అది అయ్యే ప‌నేనా అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు బోయ‌పాటి పై సెటైర్లు వేస్తున్నారు. అంటే బోయ‌పాటి కాన్ఫిడెంట్ ఏంటి సినిమా షూటింగ్ ఎలా పూర్తి చేద్దామ‌ని ఎలా రిలీజ్ చేద్దామ‌ని అనుకుంటున్నారు.  అలాగే బాల‌య్య పాత్ర మీద కూడా చాలా ట్రోల్స్ జ‌రుగుతున్నాయి. మ‌రి సినిమా విడుద‌ల‌య్యాక ఎలా ఉంట‌దో ఏంటో చూడాలి. బోయ‌పాటి కాంప్ర‌మైజ్ అయితే అయ్యే ప్ర‌సక్తే లేదంటున్నారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: