కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇక శాశ్వతంగా సినిమాలు మానుకోవాలనుకుంటున్నాను..అందుకే బాబా సినిమా చేస్తున్నాను అంటూ బాబా సినిమా సమయంలో వెల్లడించారు. అయితే బాబా భారీ డిజ్సాస్టర్ గా మిగిలింది. అందుకే ఆయన అనుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నారు. బాబా తర్వాత మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శంకర్ దర్శకత్వం లో వచ్చిన శివాజి, రోబో భారీ స్థాయిలో సక్సస్ ని అందుకున్నాయి. ముఖ్యంగా రోబో ప్రపంచ వ్యాప్తంగా రజనీ స్టామినా, మార్కెట్ ఏంటో రుజువు చేసింది. 

 

అంతేకాదు నేను గనక సినిమాలు చేయడం మానేస్తే శంకర్ లాంటి దర్శకుడితే శివాజి, రోబో లాంటి సినిమాలు చేయగలిగే వాడిని కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తోను ఒక్కసారైనా శంకర్ దర్శకత్వంలో సినిమా చేయమని కోరారు. అయితే ఆ తర్వాత నుంచి రజనీకాంత్ సినిమాలు భారీ ఫ్లాప్స్ గా మిగులుతున్నాయి. కబాలి, కాలా, పేట, దర్బార్ సినిమాలు రజనీకాంత్ నుంచి వరసగా వచ్చాయి. వచ్చిన సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. దాంతో నిర్మాతలు బాగా నష్ట పోయారు. అయినా సూపర్ స్టార్ మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాలేదన్న టాక్ వినిపిస్తుంది.

 

రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన దర్బార్ కి కూడా రజనీకాంత్ దాదాపు 80 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. వరుసగా ఫ్లాప్స్ వచ్చినా గాని డిస్ట్రిబ్యూటర్స్ రజనీకాంత్ మీద నమ్మకంతో భారీగా పెట్టు బడులు పెట్టి కొనుగోలు చేశారు. కానీ సినిమా భారీగా ఫ్లాప్ కావడం తో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయామని దర్శకుడు మురగదాస్, నిర్మాత అలాగే హీరో రజనీకాంత్ ఇళ్ళ ముందు ధర్నాలకి దిగారు. అయినా రజనీకాంత్ ఇవేమీ పట్టనట్టుగా నెక్స్ట్ సినిమాకి కమిటయ్యారు. 

 

అయితే ప్రస్తుతం కరోనా కారణం గా కోలీవుడ్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. దాంతో తమిళ నిర్మాతలు సీనియర్ స్టార్ హీరో అయిన రజనీకాంత్ గనక ముందుకు వచ్చి రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే అందరి నిర్మాతలకి మేలు జరుగుతుందని ప్రతిపాదన తెచ్చారట. మరి తలైవర్ ఇందుకు సహకరిస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. అయితే తలైవర్ ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకుంటారన్న సంగతి తెలిసిందే. అదే ఆయనని ఈ స్థాయికి తీసుకు వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఆలోచిస్తే ఇంతకంటే గొప్ప వ్యక్తి మరొకరు ఉండరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: