కెరటం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఆ సినిమా అంతగా గుర్తింపు రాలేదు. కాని సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో లైం లైట్ లోకి వచ్చింది. ఈ ఒక్క సినిమాలో ప్రార్థన పాత్రలో నటించి ఇండస్ట్రీ దృష్ఠిని ఆకర్షించింది. చాలా రోజులు రకుల్  ని ప్రార్థన అన్న పేరుతోనే పిలిచారు. ఇక తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మెరిసిపోయింది. నాగచైతన్య తో రారండోయ్ వేడుక చూద్దాం, మహేష్ బాబు స్పైడర్, ఎన్.టి.ఆర్ తో నాన్నకు ప్రేమతో, రాం చరణ్ తో దృవ, బ్రూస్ లీ, గోపీచంద్ తో లౌఖ్యం..  లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది. వరసగా బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుంది. 

 

అంతే ఇక టాలీవుడ్ లో మేకర్స్ తమ సినిమాలకి ఫస్ట్ ఛాయిస్ గా రకుల్ నే ఫిక్స్ చేసుకునేవారు. దాంతో ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసేంతగా బిజీ అయింది. అంతేకాదు రకుల్ చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అవుతుండటంతో నిర్మాతలు లక్కీ హీరోయిన్ అంటూ కోటి, రెండు కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు. ఈ క్రేజ్ తోనే తమిళం, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలనుంచి జోరుగా ఒకటికి మించి ఒకటి అన్నట్టుగా అవకాశాలు వచ్చాయి. కోలీవుడ్ లోను సక్సస్ ఫుల్ హీరోయిన్ అన్న పేరు సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ లోను అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరో తో నటించి హిట్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తుంది. 


   
అయితే రకుల్ పరిస్థితి ప్రస్తుతం చాలా బ్యాడ్ గా ఉంది. దానికి తోడు పూజా హెగ్డే, సమంత, కీర్తి సురేష్, రష్మిక మందన్న లాంటి హీరోయిన్స్ తాకిడి గట్టిగా తగిలింది. దాంతో రేస్ లో వెనకపడి పోయింది. దానికి తోడు టాలీవుడ్ లో సీనియర్ హీరో నాగార్జున తో మన్మధుడు 2 లో అవకాశం వచ్చిందని మళ్ళీ ఫాం లోకి వస్తా అనుకొని ఒప్పుకొని చేయకూడని తప్పు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ అందుకుంది. దాంతో తెలుగు సినిమా ఒక్కటి కూడా చేతిలో లేకుండా పోయింది. 

 

అయితే ఇప్పుడు రకుల్ కి లక్ కలిసొచ్చి యంగ్ హీరో నితిన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ ఛాన్స్ తో రకుల్ మళ్ళీ ఫాం లోకి వచ్చి తన తోటి హీరోయిన్స్ కి పోటీ ఇవ్వాలనుకుంటుంది. అంతేకాదు కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో నిర్మాతలు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే హీరోయిన్ ని వద్దనుకుంటున్నారట. ఆల్రెడి సక్సస్ ట్రాక్ లో ఉండి కాస్త వెనకబడ్డ వాళ్ళకి మళ్ళీ ఆఫర్ ఇవ్వాలని సర్చ్ చేస్తున్నారట.

 

అందుకే రకుల్ ని ఇప్పటికే కొంతమంది నిర్మాతలు అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత మొదలవబోయో రెండు సినిమాలకి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయట. దీన్ని బట్టి చూస్తే రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ టాలీవుడ్ లో వెలగబోతుందని మాటలాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: