టాలీవుడ్ పాపులర్ యాంకర్స్ లో స్థానం సంపాదించుకున్న శ్రీముఖి ఈ లాక్ డౌన్ టైం లో కూడా పనిచేస్తుందా అంటే అవుననే అంటున్నారు. ఎవరో చెప్పడం కాదు ఏకంగా శ్రీముఖి తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో ఇంట్లోనే సొంతంగా మేకప్ వేసుకుని ఫోటోలు దిగి ఆ విషయాన్ని వెళ్లడించింది. పసుపు కలర్ హాఫ్ శారీలో శ్రీముఖి బాపు గారి బొమ్మలా ఉందని చెప్పొచ్చు. చూస్తూ ఉండండి.. ఇంట్లో కూర్చుని వర్క్ చేతున్నా.. ఈ మ్యాడ్ ఎక్స్ పీరియన్స్ బాగుంది. 

 

క్వారెంటైన్ మహిమ ఇది అంటూ శ్రీముఖి ఆ ఫోటోల కింద కామెంట్ పెట్టింది. తనకు తానే  మేకప్, ఫోటోగ్రఫీ చేసుకుంటూ మీ, మీ అండ్ మీ అంటూ కామెంట్ పెట్టింది. మొత్తానికి లాక్ డౌన్ ఉన్నా కొన్ని ప్రోగ్రామ్స్ కు శ్రీముఖి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాల షూటింగులు, సీరియల్ షూటింగులు, రియాలిటీ షోలు అన్ని బంద్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఇంటి నుండి పనిచేస్తూ కొంతమేరకు ఎంటర్టైన్ చేయాలని చూస్తుంది శ్రీముఖి. ఇంతకీ శ్రీముఖి చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటి అది ఏ ఛానెల్ లో వస్తుందని ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు. 


షూటింగ్స్ బంద్ అవడం వల్ల సినీ స్టార్స్ కూడా ఇంటికే పరిమితం అయ్యారు. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే లాక్ డౌన్ ఎత్తేసినా షూటింగులకు ఎప్పటినుండి పర్మిషన్ ఇస్తారో తెలియాల్సి ఉంది. రిలీజ్ అవ్వాల్సిన సినిమాల లిస్ట్ కూడా చాలానే ఉంది. కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ కు వేల కోట్ల నష్టం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. శ్రీముఖి లానే ఇంట్లోనే ఉంటూ అందరు తమ పని తాము చేస్తే కొంతమేరకు బెటర్ అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: