కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా లాక్ డౌన్ అమలవుతోంది. ఈనేపథ్యంలో పలువురు సినీ తారలు తమ వంతుగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ చాలా ముందున్నాడు. ఇప్పటికే ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన కార్తీక్, వరుసగా వీడియోలను రిలీజ్ చేస్తూ ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాడు. కోకి పూచేగా అనే పేరుతో వరుసగా వీడియో సందేశాలను రిలీజ్ చేస్తున్నాడు.
అయితే అందులో భాగంగా రెండో ఎపిసోడ్ ప్రస్తుతం ఎడిటింగ్ జరుగుతోంది. అయితే ఈ ఎపిసోడ్ రెండరింగ్కు చాలా సమయం తీసుకుంటుండటంతో ఆ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశాడు కార్తీక్ ఆర్యన్. అయితే ఈ పోస్ట్ కింద ఓ అభిమాని నీకు లక్ష రూపాయలు ఇస్తా నా మెసేజ్కు రిప్లై ఇవ్వు అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్కు రిప్లైగా నేనే 2 లక్షలు ఇస్తా నా ఎపిసోడ్ రెండర్ చేయించు అంటూ సమాధానం ఇచ్చాడు కార్తిక్.
బాలీవుడ్ లో సూపర్ క్రేజ్తో దూసుకుపోతున్న కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం దోస్తానా 2తో భూల్ భులయ్యా 2 సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడంటంతో సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో ఎవేర్నెస్ కలించే పనిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో.