డార్లింగ్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రాధాకృష్ణ‌కుమార్ డైరెక్ష‌న్‌లో యువీ క్రియేష‌న్స్, గోపీ కృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ స‌రికొత్త లోకం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న వేళ ఎంతో రిస్క్ చేసి మ‌రీ ఈ చిత్ర టీమ్ జార్జియా వెళ్లి కీల‌క స‌న్నివేశాల షూటింగ్‌ని పూర్తి చేసింది.

 

తిరిగి ఇండియా వ‌చ్చిన ఈ చిత్ర బృందం క్వారెంటైన్‌కే ప‌రిమిత‌మైపోయింది. ఎవ‌రెవ‌రైతు .జార్జియా వెళ్ళారో వాళ్ళంద‌రూ కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుని ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మార్చి 25న ఉగాదికి ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తార‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురుచూశారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఆ త‌రువాత అయినా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తార‌ని ఆశించారు. అదీ జ‌ర‌క్క‌పోవ‌డంతో దీంతో ఆగ్ర‌హించిన ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా యువీని బ్యాన్ చేయాలంటూ ప్ర‌చారం చేశారు. దీంతో యువీ టీమ్ ఫ‌స్ట్‌లుక్‌ని ఎందుకు రిలీజ్ చేయ‌లేక‌పోతున్నారో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

 

లాక్‌డౌని మే 3 వ‌ర‌కు పొడిగించ‌డంతో యువీ టీమ్ వ‌చ్చే నెల మూడ‌వ వారంలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు యువీ గుడ్ న్యూస్ చెప్ప‌డానికి సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలిసింది. మే యూడ‌వ వారంలో టైటిల్‌తో పాటు ప్ర‌భాస్ ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ చిత్రానికి జాన్‌, ఓ డియ‌ర్‌, రాధేశ్యామ్ అనే టైటిల్స్‌ని ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌స్తుతం లాక్ డౌన్ ఉన్న కార‌ణాన్న ఏ సినిమా అప్‌డేట్ కూడా ఇప్ప‌ట్లో వ‌చ్చే అవ‌కాశాలు లేవు. లాక‌వ్ డౌన్ పూర్త‌య్యేస‌రికే ఒక నెల పాటు ప‌ట్టేటట్టే ఉంది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ‌కి గుర‌వ‌క త‌ప్ప‌దు. ఇదంతా స‌ర్దుమ‌ణిగిన‌ప్ప‌టికీ వెంట‌నే షూటింగ్‌లు మొద‌లుపెట్టి ప‌నులు చేయ‌డం కూడా అంత శ్రేయ‌స్క‌రం కాద‌ని మ‌రికొంద‌రు భావిస్తున్నారు. మ‌రి ఈ క‌రోనా ఎక్క‌డికి దారి తీస్తుందో ఏమో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: