టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో సౌందర్య ఒకరు. ఆమె చేసిన సినిమాలు అందులో ఆమె చేసిన పాత్రలు, ఆమె సరసన నటించిన హీరోలు అందరూ కూడా ఒక స్థాయి ఉన్న వాళ్ళే. తక్కువ కాలంలో భారీగా అభిమానులను సంపాదించుకున్న నటి సౌందర్య. ఆమెతో సినిమా చెయ్యాలి అంటే అప్పుడు హీరోలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. ఆమె కూడా ఎక్కువగా అగ్ర హీరోలతోనే సినిమాలను చేసింది. అందులో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, కృష్ణ ఇలా అగ్ర హీరోలతో ఆమె నటించి మెప్పించింది. 

 

ఇక జగపతి బాబు తో ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడమే కాకుండా ఆమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక ఆ సినిమాలలో వాళ్ళ ఇద్దరినీ చూసిన ప్రేక్షకులు అయితే వీరి మధ్య ఏదో ఉందీ అనుకునే విధంగా ఆ సినిమాలు ఉండేవి. అయితే సౌందర్య విషయంలో వెంకటేష్ కి జగపతి బాబు కి మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. వెంకటేష్ తో ఆమె సన్నిహితంగా ఉండేది. ఇది జగపతి బాబు కి ఎక్కువగా నచ్చేది కాదని ఆయన పలు మార్లు ఈ విషయంలో సౌందర్య కు చెప్పినా సరే సౌందర్య మాత్రం వెంకటేష్ కి దూరం కాలేదని సమాచారం. 

 

అందుకే ఈ ఇద్దరి మధ్య ఆ తర్వాత గొడవలు కూడా అయ్యాయని... సౌందర్య ఇద్దరి కి దూరం జరిగిందని సమాచారం. అప్పట్లో అగ్ర దర్శకులు వీళ్ళ మధ్య రాజీ చేయడానికి ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళ మధ్య గొడవలు ఆగలేదని తెలుస్తుంది. దీని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే సౌందర్య సినీ కెరీర్ లో ఆమె పక్కన బాగా మెప్పించిన వారిలో జగపతి బాబు వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: