బాబుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇపుడు ప్రభాస్ చేసే ఏ సినిమా అయినా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఎక్కువ భాగం యూరప్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

 

 

కరోనా వైరస్ వల్ల ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది. కరోనా వైరస్ అడ్డంకి పూర్తిగా తొలగిపొతేగానీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకపోవచ్చని అంటున్నారు. అయితే ఇదిలా ఉంటే, ప్రభాస్ తర్వాతి చిత్రం గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మహానటి సినిమాతో తానేంటో నిరూపించుకున్న నాగ్ అశ్విన్ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్ తో తెరకెక్కిస్తున్నాడని తెలియగానే డార్లింగ్ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగింది.

 

 


బయోపిక్ ని తెరకెక్కించడం అంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్ళు ఉంటాయి. కానీ వాటన్నింటినీ ఎదుర్కొని బయోపిక్ ని కూడా అంత ఎంటర్ టైనింగ్ గా చెప్పొచ్చని మహానటి ద్వారా నిరూపించాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేసే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సైన్స్ ఫిక్షన్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ ఉంటుందని చెప్పాడు.

 

 

అంటే హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోదని చెప్పకనే చెప్పాడు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు ఇంకా పెరిగాయి. ఆ ఆసక్తితోనే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం వల్ల వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: