నటసింహం నందమూరి బాలకృష్ణ హిట్ సినిమాలు లేక వరుస డిజాస్టర్ సినిమాలతో తీవ్ర నిరాశలో ఉన్నారు. కేవలం బోయపాటి శ్రీనివాస్ తో తప్ప మిగతా దర్శకులతో సినిమాకి చేసేందుకు ఆయన జంకుతున్నారు. ఎందుకంటే తాను ఏ ఇతర దర్శకుడితో సినిమా తెరకెక్కించినా... అది అట్టర్ ఫ్లాప్ సినిమానే అవుతుంది. గత దశాబ్దకాలంలో బాలయ్య బాబు కి లెజెండ్, సింహ లాంటి హిట్స్ ఇచ్చింది కేవలం బోయపాటి శ్రీనివాసేనని చెప్పుకోవచ్చు. అందుకే ఆయనతో జతకట్టి మరో సినిమా తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు బాలకృష్ణ. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా... ఫస్ట్ ఆఫ్ లోని కొన్ని నిమిషాలపాటు నెగటివ్ షేడ్స్ లో కనిపించనున్నారని సినీ వర్గాల నుండి టాక్. 

 


ఈ చిత్రంలో బాలయ్య తో ఇద్దరు కథానాయకులు రొమాన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ ఇద్దరు కథానాయకులు కోసం శ్రియ, అంజలి లను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా యొక్క చిత్రీకరణ మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉండగా... ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

 


ఈ సినిమాలో ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన పాత్ర ఉంటుందట. అయితే ఆ పాత్రలో నటించడానికి రావు రమేష్ తప్ప మరే ఇతర యాక్టరు సరితూగరని బాలకృష్ణ తేల్చి చెప్పేశారట. దాంతో సినిమా బృందం రావు రమేష్ ని సంప్రదించి బాలయ్య సినిమాలో నటించాలని ఆయన్ని కోరారట. అందుకుగాను రావు రమేష్ కూడా అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల నుండి టాక్ బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులారిటీ సంపాదించిన రావు రమేష్ ఏ క్యారెక్టర్ లో అయినా చాలా చక్కగా ఒదిగిపోతారు. బాలయ్య సినిమాలో తాను చేస్తే ఖచ్చితంగా తనకు చాలా మంచి క్రెడిట్ దక్కుతుంది. అందుకోసమే తాను బాలయ్య సినిమాకి ఓకే చెప్పినట్టు అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: