సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన తన తర్వాత చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా, మే లేదా జూన్ నెల నుండి చిత్ర షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఎప్పుడెప్పుడు లాక్డౌన్ పూర్తవుతుందా. ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళాలా అని ఇటు మహేష్, అటు పరశురాం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారట. అయితే లాక్డౌన్ వలన ఇప్పటికే చాలా రోజులు ఇంటికి పరిమితమైన నేపథ్యంలో మహేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
అదేమిటంటే...లాక్ డౌన్ పరిస్థితుల వలన పరుశురాంతో చేయల్సిన కొత్త సినిమా డిలే అవుతుంది. దీంతో షూటింగ్ ఒకసారి మొదలుపెట్టాక ఎక్కువ బ్రేక్లు ఇవ్వకుండా చిత్ర నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని మహేష్ అండ్ టీం భావిస్తుందట. లాక్డౌన్ ఉన్నప్పటికి వీరి మనసంతా ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలుపెట్టేద్దామా అని ఎదురు చూస్తున్నారు. మహేష్ కూడా తాను నాన్స్టాప్గా షూటింగ్లో పాల్గొంటానని చిత్ర బృందానికి చెప్పినట్లు తెలుస్తుంది. మాములుగా మహేష్ ఒక చిత్రం అవ్వగానే తర్వాత సినిమా కోసం కనీసం మూడు నెలల పాటు గ్యాప్ ని తీసుకుంటారు. ఆ గ్యాప్లో తన ఫ్యామిలీతో గడుపుతారు. ఇది ఎప్పుడూ జరిగే ప్రక్రియే అయితే ఈ సారి మాత్రం మహేష్కి ఈ కరోనాతో మరికాస్త ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడిపే అవకాశం లభించిందని చెప్పాలి.
అంతేకాక ముందుగా అనుకున్న వంశీపైడిపల్లి సినిమా ఓకే అయ్యుంటే ఇంత గ్యాప్ వచ్చేది కాదు దాదాపు ఈపాటికే సినిమా సెట్స్ మీదకి వెళ్ళి కొంత షూటింగ్ కూడా మొదలయ్యేది. అయితే వంశీ కథ నచ్చకపోవడంతో ఇంత గ్యాప్ వచ్చిందని చెప్పాలి. మరి ఇప్పుడు పరశురాం మహేష్ని ఎలా చూపించబోతున్నాడో తెర మీదే చూడాలి.