క్రేజ్  పెరిగిన కొద్దీ హీరోయిన్ల పారితోషికాలు అంతకంతకూ పెంచుతూ ఉంటారు అన్న విషయంతో. కొన్నిసార్లు నిర్మాతలకు కూడా షాక్ ఇస్తూ ఉంటారు హీరోయిన్లు . తాజాగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అలాంటి షాక్ ఇచ్చింది నిర్మాతలకు. బాలీవుడ్ లో దీపికా పదుకొనే కు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. గ్లామర్ పాత్రల్లో నటిస్తూ ఎంతోమందిని ఆకట్టుకోవడంతో పాటు విభిన్నమైన విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది దీపికాపదుకొనె. ఓవైపు నటిగా మరోవైపు అందగత్తెగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న దీపికాపదుకునే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ లలో  మొదటి వరుసలో ఉంటుంది. 

 

 

 మామూలుగానే  బాలీవుడ్ సెలబ్రిటీలు పారితోషికం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్లతో పోలిస్తే బాలీవుడ్ హీరోయిన్ల పారితోషికం ఆకాశాన్నంటే విధంగా ఉంటుంది. గతంలో పద్మావతి సినిమా కోసం దీపికా పదుకొనే ఏకంగా 15 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీపికా పదుకొనే పారితోషకం కి సంబంధించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీపిక పదుకొనే ఇప్పుడు వరకు తెలుగు తెరపై నటించింది లేదు.అయితే ప్రస్తుతం ఈ  అందాల ముద్దుగుమ్మ ని తెలుగు తెరకు పరిచయం చేయడానికి... టాలీవుడ్లో విభిన్నమైన కథలతో మంచి సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న  దర్శకుడు నాగ్ అశ్విన్  ప్రయత్నాలు చేస్తున్నారట. 

 

 

 ప్రస్తుతం నాగ్  అశ్విన్.. రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమాలు తెరకెక్కించేందుకు  సిద్ధమవుతున్నాడు . వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మితం కానుంది. అయితే పాన్  ఇండియా లెవెల్లో  ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని  సమాచారం . దీంతో ప్రభాస్ కి జోడి కూడా ఆ రేంజ్ లో ఉండాలని భావించిన దర్శకుడు నాగ్ అశ్విన్  ఈ సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనేను తీసుకోవాలని  భావించారట. దీపికా పదుకొనే తో సంప్రదింపులు కూడా జరిపారట . అయితే దీపికా పదుకొనే పారితోషికం విషయంలో నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చిందట. ఏకంగా  25 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట దీపిక.దీంతో నిర్మాతలు కాస్త  ఆలోచనలో పడినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: