ప‌వ‌న్ క‌ళ్యాణ్ - త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి కాంబోలో జ‌ల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాత‌వాసి మూడు సినిమాలు వ‌చ్చాయి. వీటిల్లో జ‌ల్సా, అత్తారింటికి దారేది రెండు సినిమాలూ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక అజ్ఞాత‌వాసి ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేసే ముందు 2018 సంక్రాంతికి వ‌చ్చి భారీ అంచ‌నాల మ‌ధ్య బొక్క బోర్లా ప‌డింది. సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఎంతో సాన్నిహిత్య ఉంది. ప‌వ‌న్‌కు తాను ఎందుకు వీరాభిమాని అయ్యానో త్రివిక్ర‌మ్ స్వ‌యంగా చెప్పాడు.

 

జ‌ల్సా సినిమా కోసం క‌థ చెప్పేందుకు తాను హైద‌రాబాద్ స‌మీపంలో అన్న‌వ‌రం షూటింగ్ జ‌రుగుతుంటే అక్క‌డ‌కు వెళ్లాన‌ని.. అక్క‌డ రాళ్లు కొట్టుకునే నిరుపేద దంప‌తుల పిల్లాడు తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని.. వాళ్ల ద‌గ్గ‌ర డ‌బ్బులు కూడా లేవ‌ని... ఆ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ వెంట‌నే త‌న కారు ఇచ్చి ఆ బాబును ఓ కార్పొరేట్ హాస్ప‌ట‌ల్‌కు పంపి ట్రీట్మెంట్ చేయించార‌ని... ప‌వ‌న్ ఫేస్లో అప్పుడు ఎంతో బాధ తాను చూశాన‌ని త్రివిక్ర‌మ్ చెప్పాడు. అనంత‌రం ఆ నిరుపేద దంప‌తుల‌కు పవ‌న్ మ‌ళ్లీ డ‌బ్బులు ఇచ్చి పంపాడ‌ని త్రివిక్ర‌మ్ చెప్పారు. ప‌వ‌న్‌ది ఎంత జాలి గుండో తాను ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలా సార్లు చూశాన‌ని త్రివిక్ర‌మ్ చాలా సార్లు గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: