టాలీవుడ్ లో ఒక్క సినిమాలో కనీ వినీ ఎరుగని రీతిలో ట్రెండ్ సృష్టించారు సందీప్ వంగా.   విజయ్ దేవరకొండ హీరోగా షాలినీ పాండే హరోయిన్ గా ‘అర్జున్ రెడ్డి’ మూవీ తెరకెక్కించారు.  ఈ మూవీ మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.. కానీ మూవీ కంటెంట్ చూసిన యూత్ మాత్రం నీరాజనాలు పలికారు. యూత్ ఈ మూవీకి బాగా ఆకర్షితులయ్యారు.  ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో సందీప్ వంగా మరో సినిమా తీయలేదు కాదు.. కాకపోతే బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రిమేక్ గా ‘కబీర్ సింగ్’ తో సూపర్ హిట్ అందుకున్నాడు.  

 

మూవీ తమిళ్ లో కూడా రిమేక్ అయ్యింది.  మొత్తానికి బోల్డ్ కొంటెంట్ అన్నా.. సినిమా కథకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.  ఆ తర్వాత సందీప్ వంగాతో టాప్ హీరోలు సినిమాలు తీసేందుకు ముందుకు వచ్చారు. కాకపోతే మంచి కథతో రెడీ అయి వస్తానని అంటున్నారు ఈ దర్శకులు.  తాజాగా  తదుపరి ప్రాజెక్ట్‌లో హీరో ఎంపిక కోసం కష్టపడుతున్నారు. తొలుత బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఒప్పుకున్నా, ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్స్‌తో వైదొలిగినట్టు వార్తలు వచ్చాయి. ఆపై, ప్రభాస్, మహేశ్ బాబు పేర్లు కూడా తెరపైకి వచ్చినా అధికారిక ప్రకటన రాలేదు.

 

అయితే, టాలీవుడ్ తాజా సమాచారం మేరకు, అల్లు అర్జున్‌ను సందీప్‌ రెడ్డి సంప్రదించినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీలో నటిస్తున్నాడు.   ఈమూవీ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది.. ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు అల్లు అర్జున్.  ఈ మూవీ తర్వాత అంతా కుదిరితే సందీప్ వంగా దర్శకత్వంలో నటించే యోచనలో ఉన్నట్లు సమాచారం.  ప్రస్తుతం కరోనా వల్ల అన్ని షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: