'అయ్యప్పనుమ్ కోసియుమ్'...ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇది మలయాళంలో రీసెంటుగా విడుదలై ఘన విజయం సాధించిన ఒక సినిమా. ఈ సినిమాలో పృథ్వీరాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు చూస్తున్నారు. తెలుగు విషయానికి వస్తే ఈ సినిమా రీమేక్ రైట్స్ హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. దీంట్లో ఎవరు నటించబోతున్నారనే దానిపై రోజొక వార్త వాస్తు ఉంది. మొన్నటి దాకా విక్టరీ వెంకటేష్ - రవితేజలతో రీమేక్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. తర్వాత బాలయ్య - ఎన్టీఆర్ కలిసి చేస్తున్నారంటూ మరో వార్త బయటకు వచ్చింది. అక్కడితో ఆగకుండా బాలయ్య - మంచు విష్ణు నటిస్తున్నట్లు మరో వార్త పుట్టుకొచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వచ్చింది. 

 

IHG

 

ఈ సినిమాలో పృథ్వీరాజ్ పోషించిన కోషియమ్ క్యారెక్టర్ కు రానాను తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర చేయడానికి రానా కూడా ఆల్మోస్ట్ అంగీకరించాడంట. కోసియుమ్ పాత్రలో బాలకృష్ణను తీసుకోవాలనుకున్నారు. కానీ బాలకృష్ణ ఆ పాత్ర చేసేందుకు ఆసక్తికనబరచక పోవటంతో ఆ పాత్రలో మాస్ రాజా రవితేజ రవితేజ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. రవితేజ కూడా ఆ పాత్రకు దాదాపు ఓకే చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ - హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లపై తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అన్ని అనుకున్నట్టుగా సెట్ అయితే లాక్ డౌన్ పూర్తయిన వెంటనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: