టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే భారీ స్థాయిలో తెరకెక్కడం కామన్ అయిపోయింది. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియన్ స్టోరీ పక్కాగా కావాల్సిందే అన్నట్టు తయారయ్యియి పరిస్థితులు. బాహుబలి సిరీస్ తర్వాత చేసిన సాహో ఇందుకు ఉదాహరణ. కథగా అంత స్కోప్ లేకపోయినా తెరకెక్కించడంలో మాత్రం ఆ గ్రాండియర్ చూపించారు. సాహో తర్వాత ప్రస్తుతం చేస్తున్న సినిమా కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ ఫిలింనగర్ లో రౌండ్ అవుతోంది.

 

 

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కథ డిమాండ్ ప్రకారం సినిమాను విదేశాల్లో ఎక్కువగా చిత్రీకరించాల్సి ఉందట. ఇందుకు ఇటివలే జార్జియాలో కొంత షూటింగ్ జరుపుకుని వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాతి షెడ్యూల్ ఇటలీలో జరగాల్సి ఉంది. అయితే.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇటలీ కాదు కదా ఇండియా బోర్డర్ దాటి వెళ్లే పరిస్థితులు కనిపించటం లేదు. అందుకే ఇటలీలోని కొన్ని సెలెక్టడ్ లొకేషన్లను హైదరాబాద్ లోనే సెట్ రూపంలో వేయాలని యూవీ క్రియేషన్స్ డిసైడ్ అయిందని టాక్ వస్తోంది. ఇప్పటికే స్లోగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా దెబ్బకు మరింత ఆలస్యమైంది.

 

 

ఈ నేపథ్యంలో ఫారిన్ లో షూటింగ్ అంటే రిస్క్ అని భావిస్తోందట టీమ్. అందుకే ఇప్పటికే చూసొచ్చిన లొకేషన్లను సెట్ వేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తతం ఫిలింనగర్లో రౌండ్ అవుతున్న ఈ వార్తపై యూవీ క్రియేషన్స్ అఫిషియల్ గా స్పందించాల్సి ఉంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఓ డియర్, రాధే వంటి టైటిల్స్ ఫిలిం సర్కిల్స్ లో రౌండ్ అవుతున్నాయి. మరి.. సినిమా యూనిట్ ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: