కరోనా ప్రభావం భారత్ పై రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... ఇంకా చాలా మంది ముందుకు వస్తున్నారు..

 

 

 

ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం, సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. దాంతో ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి..

 

 

 

 

 సినీ ఇండస్ట్రీ షూటింగులు అన్నీ ఆపుకొని థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతవేసి లాక్ డౌన్ చేసుకుంది. దీంతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నారు. షూటింగులు ఆగిపోవడంతో ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మన టాలీవుడ్ లో ఈ ఏడాది అల్లు అర్జున్, బాలయ్య ,నిఖిల్ నాగచైతన్య లాంటి హీరోలు రెండు రెండు సినిమాలను రెడీ చేయాలని అనుకున్నారు..కానీ కరోనా దెబ్బకు ఏడాదిలో ఒక్క సినిమా విడుదల కావడం కూడా కష్టమవుతుందని అర్థమవుతుంది.. 

 

 

 

ఇకపోతే ఇళ్లలో ఉన్న సినీ నటులు కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తూ వస్తున్నారు.. అందులో భాగంగా టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని తన కొడుకుతో కరోనా గురించి తెలుసుకుంటూ ఓ వీడియో ను పోస్ట్ చేశారు.. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవ్వడమే కాకుండా నాని అభిమానులకు కన్నుల పండుగగా మారింది . ఏదిఏమైనా కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఇల్లే రక్షణ నిలయం అని ప్రభుత్వం సూచించారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: