యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి 'రాధేశ్యామ్' అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. దాదాపు ఇదే టైటిల్ ని ఫైనల్ చేసి త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో నటిస్తాడని ఇప్పటికే అనౌన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ప్రభాస్ కామినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. 

 

ఇక ఈ సినిమాని నవంబర్ లేదా డిసెంబర్ నుండి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేశారు. అయితే కరోనా మహమ్మారితో చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల్లో వచ్చే సంవత్సరానికి షిఫ్ట్ అవగా తాజా గా రూపుందుతున్న సినిమా కూడా 2021 సమ్మర్ లోనే రిలీజ్ ఉండొచ్చునని అంటున్నారు. అయితే వాస్తవంగా మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ మెగాస్టార్ కోసం కథ సిద్దం చేస్తున్నాడై, ఈ సినిమా 2020 ద్వితియార్థంలో మొదలవుతుందని ప్రచారం జరిగింది. కాని అసలు ఈ కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో ఉండబోదని క్లారిటీ వచ్చేసింది. అందుకు కారణం ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా కంప్లీటయ్యోసరికే 2021 కంప్లీటవుంది. 

 

ఇదొక కారణం అయితే ఇప్పటికే మెగాస్టార్ కూడా కొరటాల శివ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మూడు సినిమాలు ఫైనల్ అని తాజా సమాచారం. సాహో ఫేం సుజీత్ దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ తో పాటు సర్ధార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ, రీసెంట్ గా వెంకీ మామా తో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బాబీ సినిమా ఒకటి. ఈ రెండంటితో పాటు త్రివిక్రం సినిమా కూడా ఉండబోతుంది. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాలకి సంబంధించిన ప్రకటనలు రానున్నాయట. దీన్ని బట్టి చూస్తే నాగ్ అశ్విన్ - మెగాస్టార్ కాంబినేషన్ లో మరో రెండేళ్ళ వరకు సినిమా ఉండదని క్లారిటి వచ్చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: