దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు స్టార్స్ ఈ  మూవీలో నటిస్తున్నారు. ఇద్దరు రియల్ హీరోస్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో చరణ్, ఎన్టీఆర్ మెప్పించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన అల్లూరి టీజర్ రిలీజై సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేయగా.. ఈ సినిమాకు సంబందించిన ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్ మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రాబోతుందని తెలుస్తుంది. 

 

 

ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా మొదలు కాకముందే బాహుబలి నిర్మాత దానయ్యకి 100 కోట్ల ఆఫర్ ఇచ్చాడు. అయినా సరే దానయ్య ఈ సినిమా వదులుకోలేదు. రాజమౌళి డేట్స్ ఎప్పటివో దానయ్య దగ్గర ఉండగా ట్రిపుల్ ఆర్ షురూ చేశారు. బాహుబలి తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజమౌళితో సినిమా చేయాలని అనుకున్నారట. చిరు హీరోగా కాదు నిర్మాతగా రాజమౌళి తో సినిమా చేయాలని అనుకున్నారట. కాని దానయ్య లైన్ లో ఉండటంతో చిరు ఆఫర్ కాదన్నారు. అయితే ఆర్. ఆర్. ఆర్ ముగిశాక చిరు నిర్మాణంలో రాజమౌళి సినిమా ఉండి తీరుతుందని అంటున్నారు. 

 

ప్రస్తుతం చిరు హీరోగా చేసే ఆచార్య పూర్తి కాగానే రాజమౌళిని కాంబోలో సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి చిరు నిర్మాత అంటే రామ్ చరణ్ హీరోగా చేస్తాడని చెప్పొచ్చు. నిర్మాతగా చిరు ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. కచ్చితంగా ట్రిపుల్ ఆర్ తర్వాత చిరు సినీ ఉంటుందనే తెలుస్తుంది. అదే జరిగితే ఇక రికార్డులెన్నో సృష్టించే అవకాశం ఉంది. ఆచార్య తర్వాత చిరు ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ కు ఇది మరో క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: