మెగా హీరోలందరికి డిఫరెంట్ గా సినిమా సినిమాకు కొత్తదనంతో నిండిన కథలను చేస్తూ అలరిస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. లాక్ డౌన్ టైం లో మెగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పాడు. చాట్ లో భాగంగా తనకు కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టమని చెప్పిన వరుణ్ తేజ్ మంచి కథ దొరికితే సాయి తేజ్ తో మల్టీస్టారర్ కు సిద్ధం అంటున్నాడు. వరుణ్ తేజ్ అలా చెప్పడంతో కథలు రాసేందుకు డిసైడ్ అయ్యారు దర్శకులు. 

 

మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్ ఇద్దరు కలిసి సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు. వాళ్లిద్దరూ కూడా మంచి కథ వస్తే తప్పకుండా చేస్తామని చెబుతున్నారు. కథ మెప్పిస్తే మెగా మల్టీస్టారర్ కు తాము సిద్ధమే అంటున్నారు. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్ లు ఇద్దరు వేరు వేరు స్టయిల్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. కరెక్ట్ సినిమా పడితే ఇద్దరు తమ సత్తా చాటుతారని వారి ఇదివరకు సినిమాల సక్సెస్ చూస్తే అర్ధమవుతుంది. 

 

ప్రస్తుతం సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దేవా కట్టా డైరక్షన్ లో సినిమా ముహూర్తం పెట్టుకున్నాడు. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాకే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తాడట. అయితే ఇద్దరు దర్శకులు ఆల్రెడీ స్టోరీ లైన్ వినిపించారట.. వాటిలో ఏది ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. ఇలా ఇండివిడ్యువల్ గా కాకుండా వరుణ్, సాయి తేజ్ ఇద్దరు కలిసి చేసే ఆ మెగా మల్టీస్టారర్ సినిమా కోసం అందరు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: