ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమాలో నటించిన కియరా అద్వానీ ఆ తర్వాత బాలీవుడ్ లో ఫామ్ లోకి వచ్చింది. అక్కడ అమ్మడి ఫాలోయింగ్ చూసి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా హిట్ అవడంతో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా ఛాన్స్ అందుకుంది. అయితే చరణ్ సినిమా ఆమెకు నిరాశ మిగిల్చింది. తెలుగులో కన్నా హిందీలోనే సినిమాలు చేయడం బెటర్ అనుకుంది. బాలీవుడ్ లో సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లు కూడా చేస్తున్న కియరా అద్వానీ లాస్ట్ స్టోరీస్, గల్తీ వెబ్ సీరీస్ లతో ప్రేక్షకులను అలరించింది. 

 

అయితే తెలుగులో చేసిన రెండు సినిమాలకే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కియరా మళ్ళీ తెలుగులో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా అంటుంది. అయితే అది స్టార్స్ సినిమాల అవకాశాలు అయ్యి ఉండాలని కండీషన్ పెడుతుంది. మహేష్, చరణ్ తమ నెక్స్ట్ సినిమాకు మరోసారి కియరాని రిపీట్ చేయాలని చూస్తున్నారు.టాలీవుడ్ ఇద్దరు స్టార్స్ మహేష్, చరణ్ లను బుట్టలో వేసుకుంది ఈ బాలీవుడ్ భామ. అందుకే రీసెంట్ ఇంటర్వ్యూలో మహేష్ చాలా ఫ్రెండ్లీ.. చరణ్ బెస్ట్ బడ్డీ అని సమాధానం ఇచ్చింది. 

 

తెలుగులో హీరోయిన్ కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు ఇప్పుడు కేవలం బాలీవుడ్ మీద కాన్సెంట్రేట్ చేస్తుంది కానీ టాలీవుడ్ మీద కూడా దృష్టి పెడితే మాత్రం ఇక్కడ టాప్ ప్లేస్ లో ఉండే ఛాన్స్ ఉంది. హిందీలో దీపికా, ప్రియాంకా, కత్రినా, కరీనా, అలియా భట్, పరిణితి చోప్రా లాంటి వారంతా కొద్దిగా వెనక్కి తగ్గగా కియరా మాత్రం మంచి ఫామ్లో ఉంది. ఇదే ఫామ్ కొనసాగిస్తే బాలీవుడ్ లో కూడా అమ్మడికి తిరుగు ఉండదని చెప్పొచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: