తెలుగులో ప్త్రస్తుతం టాప్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడిగితే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు థమన్, అల వైకుంఠపురములో ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అవడంతో థమన్ పేరు మారు మోగిపోయింది. దేవిశ్రీని వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చాడు. స్టార్ హీరో సినిమా అంటే అందరికీ గుర్తొచ్చే మొదటి ఆప్షన్ థమనే. అయితే మహేష్ బాబు- పరశురామ్ కాంబోలో తెరకెక్కే సినిమాకి గోపీసుందర్ ని తీసుకోవాలని చూస్తున్నారట.

 

 

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే సడెన్ గా ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో మహేష్ వేరే దర్శకుల వైపు వెళ్ళాడు. ఈ నేపథ్యంలో మహేష్ సందీప్ రెడ్డి వంగా, గీతగోవిందం పరశురామ్ వైపు చూశాడు. పరశురామ్ చెప్పిన కథకి మహేష్ ఇంప్రెస్ అయినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు.

 


లాక్డౌన్ కారణంగా ఈ కాంబోపై అధికారిక సమాచారం రాలేదు. అయితే పరశురామ్ మాత్రం మహేష్ తో సినిమా అని ఫిక్స్ అయ్యాడట. అందుకోసం చైతన్యతో అంతకుముందు ఒప్పుకున్న సినిమాని కూడా పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం మహేష్ తో చేసే సినిమా కోసమే పనిచేస్తున్నాడు. మహేష్ సినిమా కోసం క్యాస్ట్ అండ్ క్రూ ని ఎంపిక చేసే పనిలో ఉన్నాడట. పరశురామ్ గత కొన్ని రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ తో ట్రావెల్ అవుతున్నాడు.

 

 

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం మ్యూజిక్ కి మంచి పేరొచ్చింది. అందువల్ల మహేష్ సినిమా కోసం గీపీ సుందర్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని చూస్తున్నాడట. ఇప్పటి వరకు గోపీ సుందర్ స్టార్ హీరో సినిమాకి మ్యూజిక్ చేయలేదు. ఒకవేళ ఈ అవకాశం వచ్చిందంటే గోపీసుందర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదగడం ఖాయం. మరి పరశురామ్ సజెస్ట్ చేసిన పేరుని మహేష్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: