రీ ఎంట్రీ తర్వాత విజయశాంతి చేసింది కేవలం ఒక్క సినిమానే అయినా సరే ఆమె గురించి మాత్రం ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. ఆమె ఏ సినిమాలో నటిస్తున్నారు... దర్శకుడు ఎవరు... పారితోషికం ఎంత తీసుకుంటున్నారు... ఇలాటి వార్తలు ఏదోక సందర్భంలో వస్తూనే ఉన్నాయి. ఆమె నటించినా నటించకపోయినా సరే ఈ ఆసక్తి ఎక్కువగా ఉంది జనాలకు. ఆమె సినిమాల మీద ముందు నుంచి కూడా ఎక్కువగానే ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఆమె అభిమానులు టాలీవుడ్ జనం. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత అది ఎక్కువైంది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో నటించే అవకాశం వచ్చింది అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఒక పెద్ద సినిమాలో ఆమె విలన్ గా నటిస్తుంది అంటున్నారు. హీరో అక్షయ్ కుమార్ అని సమాచారం. అలాగే తమిళ సినిమాల్లో కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. ఆమెకు ఒక కీలక పాత్ర దొరికింది తమిళంలో అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమాల్లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఆమె చేసే సినిమాలు అక్కడి ప్రేక్షకులు కూడా ఎక్కువగానే చూస్తూ ఉంటారు. 

 

ఇక ఆమెకు అవకాశం ఇచ్చే దర్శకులు కూడా అగ్ర దర్శకులే అని సమాచారం. ఆమె ఇప్పటికే రెండు భాషల్లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కరోనా కారణంగా ఆగిందని తర్వాత కచ్చితంగా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం విజయశాంతి ఖాళీ గానే ఉన్నారు. రాజకీయాల మీద ఆమె ఫోకస్ చేసారు. రాజకీయాల్లో ఇప్పుడు ఆమె అవసరం లేదు అనేది పరిశీలకుల మాట. అందుకే ఆమె సినిమాల మీద దృష్టి పెడుతున్నారు అని సమాచారం. రాబోయే రెండు మూడేళ్ళ లో ఆమె సినిమాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: